Tuesday, March 26, 2024

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం..

చేగుంట : మండలం రెడ్డిపల్లి గ్రామంలో సహకార వ్యవసాయ పరపతి సంఘం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఛైర్మన్‌ మ్యాకల రమేష్‌ ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో రమేష్‌ మాట్లాడుతూ సొసైటీ పరిధిలోని రుక్మాపూర్‌ గ్రామంలో వరికోతలు ప్రారంభించారని తెలిపారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ప్రారంభించామని గ్రామసర్పంచ్‌ లక్ష్మీ, ఎంపిటిసి శంభుని రవి, సొసైటీ డైరెక్టర్‌ల సహకారంతో ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్‌ ఛైర్మన్‌ తిగుళ్ల ఆంజనేయులు, సర్పంచ్‌ లక్ష్మీ జ్ఞానేశ్వర్‌గౌడ్‌, ఉపసర్పంచ్‌ బోయిని నాగులు, డైరెక్టర్లు హరిశంకర్‌, జగతి, అంబరీష, సీఈవో నరేష్‌, సత్యనారాయణ, గ్రామ నాయకులు వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement