Thursday, April 25, 2024

ధాన్యం కొనుగోలు కేంద్రం..

చేగుంట : ఇబ్రహీంపూర్‌ వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి రాంపూర్‌ గ్రామపంచాయతీ పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఛైర్మన్‌ కొండల్‌రెడ్డి ప్రారంభించారు. ఉమ్మడి రాంపూర్‌ గ్రామపంచాయతీ పరిధిలో కరీంనగర్‌, సోమ్లాతండా నూతన గ్రామపంచాయతీలుగా ఏర్పడ్డాయి. గత సంవత్సరం రాంపూర్‌, కరీంనగర్‌ గ్రామాల్లో ఐకేపి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సోమ్లాతండా గ్రామపంచాయతీ వద్ద సొసైటీ ద్వారా కేంద్రం ఏర్పాటు చేశారు. ఖరీఫ్‌ సీజన్‌లో ఐకేపి సెంటర్లు టార్గెట్‌ను మించి ధాన్యం కొనుగోలు చేశారు. దీంతో సోమ్లాతండా వద్ద నూతనంగా సొసైటీ ఆధ్వర్యంలో కేంద్రం ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇబ్రహీంపూర్‌ సొసైటీ ఛైర్మన్‌ కొండల్‌రెడ్డి, వైస్‌ ఛైర్మన్‌ పట్నం తానీషా, ఎంపిటిసి గణేష్‌, సోమ్లాతండా సర్పంచ్‌ జానకి, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ అధికారి కిషోర్‌, టిఆర్‌ఎస్‌ నాయకులు పెద్ద బిక్యానాయక్‌, భద్య, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement