Wednesday, April 24, 2024

సీఎం కేసీఆర్ హ‌యాంలోనే తెలంగాణ అభివృద్ధి : బీఆర్ఎస్ నేత నీలం మధు

ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా అభివృద్ధి పధంలో దూసుకెళుతుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ అన్నారు. పటాన్చెరు నియోజకవర్గం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్ఎంఆర్ సేవా నిర్వహణ కార్యాలయాన్ని, చలివెంద్రం నీలం మధు ప్రారంభించారు. దేశ రాజకీయాల్లో కీలక ఘట్టాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకురానున్నారని, మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడంతో పాటు దేశంలోనే సునామీ సృష్టించే విధంగా బీఆర్ఎస్ ను ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. ఓ పక్క సంక్షేమ పథకాలు, మరొక అభివృద్ధితో ముందుకు వెళుతున్న రాష్ట్ర ప్రభుత్వం మరింత అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తుందన్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రజలందరూ సహకరించి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ని ఆశీర్వదించాలని ఆయన కోరారు. పటాన్చెరు నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేసేందుకు తాను ఎప్పుడూ ముందుంటానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మహేందర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, గంతి శంకర్, లోకేష్ బాబు, తలరి కృష్ణ, ఖదీర్, శ్రీను, ప్రసాద్, నారిన్, రాకేష్, నాని, బాల్ రాజ్, నారాయణ, దిలీప్, శ్రీను, ధనంజయ, మన్నే రాములు, బాల్ రాజ్, మహేష్, రవి, శ్రీకాంత్, నారాయణ రెడ్డి, వెంకటేశ్, NMR యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement