Thursday, April 25, 2024

చెక్ డ్యాం నిర్మాణ పనుల పరిశీలన..

కొహెడ : మండలంలోని వింజపల్లి సమ్మక్క సారాలమ్మ నల్ల బండవద్ద ఉన్న మోయతుమ్మద వాగుకు అడ్డుగా 9కోట్ల రూ.లతో నిర్మిస్తున్న చెక్ డ్యామ్‌ నిర్మాణం జరుగుతోంది. కాగ్ డ్యామ్ అడుగు భాగంలో గట్టి ప్రదేశం రాకముందే ఇసుకపై కంకర బెడ్డు వేసి నిర్మిస్తున్నారు. దాంతో చెక్ డ్యాం లో నీటి లికేజ్‌తో వాటర్ నిల్వల ఉండకుండా నిర్మించే చెక్ డ్యాంతో ఉపయోగం ఉండదని రైతులు ఆవేదన చెందడంతో స్థానిక ఎంపిటిసి ధ్యాగటి సురేందం, బిజెపి మండల అధ్యక్షులు ఖమ్మం వెంకటేశంకి సమాచారం అందించారు. దాంతో రైతులతో కలిసి బిజెపి నాయకులు డ్యాం పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు గుగ్గిళ్ల శ్రీనివాస్‌ పాము రామయ్య, కంది సత్యనారాయణ రెడ్డి, కక్కర్ల దామోదం గౌడ ఖమ్మం సతీష్‌, పుట్ట లక్ష్మణ్‌ అన్నాడి, మధుసుదన్‌ రెడ్డి, పాము నితిన్‌, కొమ్ముల శేఖం రెడ్డి, నంగునూరి ప్రసాద గ్రామ రైతులు అన్నాడి లక్ష్మారెడ్డి, గుర్రాల రాజేశ్వరెడ్డి, నంగునూరి శ్రీనివాస్‌, గర్రెపల్లి నర్సయ్య గౌడ, అన్నాడి సత్యనారాయణ రెడ్డి, దులం నారాయణ, కోమ్ముల సుధాకర్‌ రెడ్డి, తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement