Saturday, April 20, 2024

Crime News : ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య

మెద‌క్ జిల్లాలోని హవేలీఘనపురం మండలం లింసానపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వివాహిత ఆదివారం తెల్ల‌వారుజామున ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్ప‌డింది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. గ‌త కొంత కాలంగా కాపురంలో మనస్పర్థలు రావడంతో భార్య‌భ‌ర్త‌ల మ‌ధ్య గొడవలు జరుగుతున్నాయి. భార్య శిరీష తల్లిదండ్రులు వచ్చి నచ్చజెప్పి వెళ్ళారు. కానీ ఆదివారం ఉదయం ఇంట్లో ఎవరు లేనిది చూసిన శిరీష్(23) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీనితో కుటుంబీకులు కిందకు దించి చూడగా అప్పటికే శిరీష మృతి చెందింది. విషయం తెలుసుకున్న మృతురాలి తరపు బంధువులు ఘటన స్థలానికి చేరుకొని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దశలో ఇంటి పై దాడికి సిద్ధమయ్యారు. దీనితో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న మెదక్ డీఎస్పీ సైదులు ఆధ్వర్యంలో ఘటన స్థలానికి చేరుకొని బందోబస్తు నిర్వహించారు. శిరీష మృతిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు. దీంతో శాంతించిన మృతురాలి బంధువులు పోస్టుమార్టంకు మృతదేహాన్ని తరలించేందుకు అంగీకరించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మురళి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement