Sunday, April 14, 2024

కోవిడ్‌ టీకా అపోహలు వద్దు..

మెదక్‌ : కరోనా టీకాపై అపోహలు వద్దని ప్రభుత్వం అందిస్తున్న కరోనా టీకా సద్వినియోగం చేసుకోవాలని మెదక్‌ ఎంపిపి యమున జయరాంరెడ్డి సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా టీకాను వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ అతలాకుతలం చేసి ఎంతో మంది ప్రాణాలు బలిగొన్న మహమ్మరి కరోనాను తరిమికొట్టేందుకు ప్రభుత్వం అందిస్తున్న వ్యాక్సిన్‌ అందరూ సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. మెదక్‌ ఎంపిపి యమున భర్త జయరాంరెడ్డి కరోనా వ్యాక్సిన్‌ టీకా వేయించుకున్నారు. కరోనా వ్యాక్సిన్‌ టీకాపై వస్తున్న అపోహలు నమ్మవద్దన్నారు. ప్రతి ఒక్కరు విధిగా కరోనా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని తెలిపారు. అలాగే తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement