Wednesday, April 24, 2024

సంగారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో కరోనా కలకలం

సంగారెడ్డిలో కరోనా విజృంభిస్తోంది. కోవిడ్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మంత్రి హరీష్ రావు సూచించినా వైద్యాధికారుల్లో నిర్లక్ష్యం కొరవడుతున్నట్లు తెలుస్తుంది. ఫలితమే గత వారం రోజులుగా సంగారెడ్డిలో రెట్టింపు గా పాజిటివ్ కేసులు నమోద‌వుతున్నాయి. ఇదిలా ఉండగా సంగారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ చంద్ర శేఖర్ తో పాటు డీఈ ఇంతియాజ్ అహ్మద్ కు పాజిటివ్ గా నిర్దారణ జరిగింది. గత వారం రోజులుగా వీరితో కాంటాక్ట్ అయిన వారిని పరీక్షలు చేయించుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారిరువురు కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement