Tuesday, April 23, 2024

సీసీ రోడ్డు పనులు ..

చేగుంట : మండలం చందాయిపేట గ్రామంలోని 9వ వార్డులో సీసీ రోడ్డు పనులను సర్పంచ్‌ బుడ్డా స్వర్ణలత భాగ్యరాజ్‌ ప్రారంభించారు. 9వ వార్డులో చెత్త వాహనాలు వెళ్లాలన్నా, ప్రజలు వెళ్లడానికి ఇబ్బంది ఉన్నందున సీసీ రోడ్డు పనులు ప్రారంభించామన్నారు. దశలవారీగా గ్రామంలో సీసీ రోడ్ల పనులు ప్రారంభిస్తామని, అత్యవసర సమయంలో ముందుగా అవసరమైన చోట్ల పనులు చేస్తానని స్వర్ణలత భాగ్యరాజ్‌ వెళ్లడించారు. రానున్న వర్షాకాలం సీజన్‌ దృష్టిలో పెట్టుకొని సీసీ రోడ్లకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ సంతోష్‌ కుమార్‌, వార్డు సభ్యురాలు తలారి అమృత పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement