Wednesday, April 24, 2024

సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫ్రూట్స్ ను సందర్శించిన కేబినెట్ సబ్ కమిటీ

సిద్ధిపేట : సిద్ధిపేట జిల్లా ములుగు హార్టికల్చర్ యూనివర్సిటీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫ్రూట్స్ ను కేబినెట్ సబ్ కమిటీ సందర్శించింది. హార్టికల్చర్ యూనివర్సిటీ ఆవరణలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫ్రూట్స్ నర్సరీని మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర రెడ్డి సందర్శించారు. పండ్ల ఉద్యానవనంలో ఎలక్ట్రిక్ వాహనం నడుపుతూ మామిడి పండ్ల చెట్లను కేబినెట్ మంత్రుల బృందం పరిశీలించింది. అలాగే ఆయిల్ ఫామ్ మొక్కలను మంత్రుల బృందం నాటింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement