Thursday, April 25, 2024

బోనాల ఊరేగింపులో విశ్వ బ్రాహ్మణులు..

కొహెడ : మండలంలోని తీగలకుంటపల్లి గ్రామంలో విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి బోనాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. మహిళలు.. యువతులు ఉపవాస దీక్షలతో బోనాలు డప్పుల.. చప్పుళ్ళు.. బాజా భజంత్రీలతో.. నెత్తిన బోనాలతో.. శివసత్తుల.. పూనకాలు.. నృత్యాల మధ్య ఊరేగింపుగా తరలి పోచమ్మ తల్లికి బోనాలు నైవేధ్యం సమర్పించారు. పిల్లా పాపలు.. పాడి పంటలను చల్లంగా చూడాలని, దేశంలో.. రాష్ట్రంలో కరోనా మహమ్మారి త్వరగా అంతం కావాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్దిల్లాలని అమ్మవారిని కోరుకున్నారు. ఆ కార్యక్రమంలో అధ్యక్షులు చక్రపాణి కార్యవర్గ సభ్యులు రేవోజు శంకర్,‌ రాజమౌళి రాజగోపాల్,‌ వెంకటేశ్వర్లు, రాజేంద్ర ప్రసాద్,‌ రాజీవ్‌ శ్రీమంతుల శంకర్,‌ రాజు కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement