Saturday, April 20, 2024

బిజెపి సీనియర్ నాయకులకు సన్మానం..

చేగుంట : భారతీయ జనతాపార్టీ జాతీయ నేతలను స్మరిస్తూ పార్టీ ఆవిర్బావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మెదక్‌ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామంలో బిజేపి నాయకులు జెండా ఎగురవేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్బంగా బిజేపి సీనియర్‌ నాయకులు శివరాములుగౌడ్‌, నర్సింలులను సత్కరించి సన్మానించారు. బిజేపి పార్టీని ముందుకు నడిపిన జాతీయ నాయకులు అటల్‌బిహారీ వాజ్‌పేయ్‌, లాల్‌కృష్ణ అద్వాని, శ్యాంప్రసాద్‌ ముఖర్జి లాంటి జాతీయ నాయకులను గుర్తు చేసి మాట్లాడారు. దేశ ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వం వర్దిల్లాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బిజేపి చేగుంట మండల శాఖ అధ్యక్షులు చింతల భూపాల్‌, మాజీ ఎంపీపీ కర్ణపాండు, మాజీ ఏఎంసీ ఛైర్మన్‌ గడ్డమీది సుజాత రఘుపతి, సర్పంచ్‌లు ఎల్లారెడ్డి, ప్రవళిక బిక్షపతి, మాజీ సర్పంచ్‌లు రఘువీర్‌రావు, బాలచందర్‌, రాజగోపాల్‌, మహిళా మోర్చ అధ్యక్షురాలు లావణ్య, నాయకులు కొండి స్వామి, అంజనేయులు, గోవింద్‌కృష్ణ, శేఖర్‌గౌడ్‌, నెల్లూరి దాసు, భూపాల్‌రెడ్డి, శేఖర్‌, బోగరాజు, సిహెచ్‌ చంద్రమౌళి, సాయిరాజ్‌, బరందేవి, సిద్దిరాములు, సాయిబాబా, దివిటి రవి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement