Tuesday, March 26, 2024

జీవితంపై విరక్తి.. మెద‌క్‌ జిల్లాలో ఒక‌రి ఆత్మ‌హ‌త్య‌

చౌటకూర్, (ప్రభన్యూస్): మ‌ఎద‌క్‌ జిల్లాలో దారుణం జ‌రిగింది. హెల్త్ ఇష్యూస్ కార‌ణంగా ఒక‌రు ఆత్మ‌హ‌త్య చేసుకుని చ‌నిపోయిన ఘ‌ట‌న నెల‌కొంది. చాలాకాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న వ్య‌క్తి ఈ దారుణానికి ఒడిగ‌ట్టాడు. త‌న ఆరోగ్యం బాగుకాలేద‌న్న కార‌ణంతో జీవితంపై విరక్తి చెంది శనివారం ఆత్మ‌హ‌త్చ చేసుకున్న‌ట్టు ఎస్సై విజ‌య్‌కుమార్ తెలిపారు. పుల్కల్ మండలంలోని కొర్పోల్ గ్రామానికి చెందిన మల్లేశం (27) ఆరు నెలల నుండి నరాల బలహీనతతో బాధ‌ప‌డుతున్నాడు.

కొన్ని రోజులుగా మ‌ల్లేశం అనారోగ్యానికి గురయ్యాడు. అయితే హాస్పిటల్ చెక్ చేయించుకుని మందులు వాడుతున్నా నయం కాలేదు. దీంతో ఆందోళన చెందిన మల్లేశం జీవితంపై విరక్తి చెంది గ్రామంలోని తన పొలంలోని ఉరేసుకుని చ‌నిపోయాడు. మృతుని కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై విజయ్ కుమార్ గౌడ్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement