Thursday, April 25, 2024

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

నిజాంపేట, మే 9 (ప్రభ న్యూస్) : చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన సంఘటన నిజాంపేట మండలం పరిధిలోని కల్వకుంట గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కల్వకుంట గ్రామానికి చెందిన బిక్షపతి(40) సోమవారం గ్రామ శివారులో గల అసులకుంటలో చేపల వేటకు వెళ్తున్నాను అని ఇంట్లో చెప్పి వెళ్లాడు. రాత్రి ఇంటికి తిరిగి రాకపోవడంతో చుట్టుపక్కల వెతికారు. మంగళవారం ఉదయం గ్రామ శివారులో గల అసులకుంట నీటిలో శ‌వ‌మై క‌నిపించాడు. దీంతో స్థానిక పోలీసులకు సమాచారం అందించగా.. సంఘటన స్థలానికి చేరుకొని శవాన్ని బయటకు తీసి పరిశీలించారు. అనంత‌రం పోస్టుమార్టం నిర్వ‌హించారు. మృతుని తల్లి నరసవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement