Friday, March 29, 2024

గోడ కూలి వ్యక్తి మృతి

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడిఏ బొల్లారం బీరప్ప బస్తీలో ఇంటి గోడ కూలి సూర్జకంట హంసడ (32) అనే వ్యక్తి మృతి చెందాడు. బతుకు తెరువు కోసం ఐడిఎ బొల్లారం కు కలకత్తా నుండి వచ్చి పరిశ్రమలలో విధులు నిర్వహిస్తూ బొల్లారంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. ఎప్పటిలాగానే భార్య పిల్లలతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో తెల్లవారు జామున ఇంటి గోడ కూలి అతనిపై పడడంతో స్థానికులు గుర్తించి బాచుపల్లి పరిధిలోని మమత హాస్పిటల్ కి తరలించారు. అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు వెల్లడించారు. భార్య‌, సంవ‌త్స‌రం బాబు ఉన్నాడు. అతని కుటుంబానికి ప్రభుత్వం తరపు నుండి సహాయం చేయాలని బొల్లారంకు చెందిన ఆనంద్ కృష్ణారెడ్డి కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement