Saturday, April 20, 2024

సిద్దిపేట – పోస్ట‌ల్ బ్యాలెట్స్ లో టిఆర్ ఎస్ కు అధీక్యం…

సిద్దిపేట మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ ఇందూర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో కొనసాగుతుంది. ఎన్నికల అధికారులు మొదటగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపును చేపట్టారు. పోస్టల్‌ బ్యాలెట్లలో అధికార టీఆర్‌ఎస్‌ ఆధిక్యం కొనసాగింది. మొత్తం 91 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు పొలవ్వగా దీంట్లో 21 ఓట్లు చెల్లకుండా పోయాయి. చెల్లిన ఓట్లలో టీఆర్‌ఎస్‌కు 44, బీజేపీకి 2, ఇతరులకు 3 ఓట్లు వచ్చాయి. 22 కౌంటింగ్‌ టేబుళ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. రెండు రౌండ్లలోనే ఓట్ల లెక్కింపు పూర్తికానుంది. మొదటి రౌండ్‌లో 1 నుండి 21 వార్డులు, రెండో రౌండ్‌లో 22 నుంచి 43 వార్డుల ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. మొత్తం 43 వార్డుల్లో 236 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement