Saturday, April 20, 2024

టీ ఆర్ఎస్ లో చేరిన స్వ‌తంత్ర అభ్య‌ర్థులు

సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నిక‌ల్లో గెలుపొందిన స్వ‌తంత్ర అభ్య‌ర్థులు(టీఆర్ఎస్ రెబ‌ల్స్) మంత్రి హ‌రీష్ రావు స‌మక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 36, 42వ వార్డుల నుంచి గెలుపొందిన ఉద‌ర జ‌య‌, కాటం శోభ‌ర‌ఘురాంకు గులాబీ కండువా క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు మంత్రి హ‌రీష్ రావు. ఈ సంద‌ర్భంగా వారిద్ద‌రికి మంత్రి శుభాకాంక్ష‌లు తెలిపారు. సిద్దిపేట మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ 36 స్థానాల్లో గెలుపొందింది. స్వతంత్రులుగా పోటీచేసి గెలుపొందిన ఐదుగురిలో టీఆర్‌ఎస్‌ రెబల్స్‌ ఉన్నారు. ఐదుగురిలో ముగ్గురు ఇప్ప‌టికే టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరిలో 20వ వార్డు స్వతంత్ర ( టీఆర్‌ఎస్‌ రెబల్‌) అభ్యర్థి రియాజ్‌, 35వ వార్డు స్వతంత్ర ( టీఆర్‌ఎస్‌ రెబల్‌) అభ్యర్థి భూంపల్లి శ్రీలత శ్రీహరి, 43వ వార్డు స్వతంత్ర ( టీఆర్‌ఎస్‌ రెబల్‌) అభ్యర్థి పయ్యావుల పూర్ణిమా ఎల్లయ్య యాదవ్‌ టీఆర్‌ఎస్‌లో చేరారు. కాగా, మిగిలిన ఇద్దరు నేడు టి ఆర్ ఎస్ లో చేరారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement