Friday, April 19, 2024

కొవ్వొత్తులు వెలిగించి నివాళులు

హవేళిఘణపూర్ : మండలంలో పంచాయతీ కార్యదర్శి జగన్నాథం ఆత్మకు శాంతి చేకూరాలని స్థానిక ఎంపిడిఓ కార్యాలయం నుండి నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం వహిస్తూ ఆత్మహత్య చేసుకున్న జగన్నాథంకు శాంతి చేకూరాలని నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శుల ప్రెసిడెంట్‌ నవీన్‌ మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులు అంటే బానిసలుగా పనిచేయడం కాదని, ప్రజలకు రాజకీయ నాయకులకు, అధికారులకు సమన్వయకర్తగా ఉండి ప్రజలకు సేవ అందించడమే ధ్యేయం అన్నారు. ఇప్పటికైనా అధికారులు గుర్తించి పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరించి వారిని ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీరామ్‌, ఎంపీఈవో ప్రవీణ్‌కుమార్‌, పంచాయతీ సెక్రటరీలు శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement