Tuesday, April 16, 2024

కొనసాగుతున్న పార్టీ సభ్యత్వాలు

టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ మండల కేంద్రములో కొనసాగుతుంది. మండల కేంద్రములో జడ్పీటీసీ పంజా విజయ్ ఎస్సి కాలనిలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతు టిఆర్ఎస్ సభ్యత్వానికి ఎస్సిల నుంచి మంచి స్పందన వస్తుందని, తెరాస ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేసిందని ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాలకు ఆకర్షితులై పార్టీ సభ్యత్వాలను స్వీకరిస్తున్నారని తెలిపారు. ఇకార్యక్రమంలో ఉపసర్పంచు కొమ్మట బాబు, బాల్ రాజు, గర్గుల సుధాకర్, అబ్దుల్ పాషా, బండారు తిరుమల్, సిద్ధరాములు, ఎల్లం, రాములు తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement