Friday, March 29, 2024

మానవత్వం చాటిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి 

మెదక్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మానవత్వం చాటారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని తన వాహనంలో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్లితే.. మెదక్ మండలం మాచవరం వద్ద ఆర్టీసీ బస్సు, బైక్‌ ఢీ కొన్ని ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో సంగారెడ్డి పర్యటన ముగించుకొని మెదక్ వస్తున్నా ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ప్రమాదాన్ని చూసి వెంటనే స్పందించారు. పోలీసులకు, అంబులెన్సు కు సమాచారం అందించారు. అంబులెన్స్‌ రావడం ఆలస్యం కావడంతో తీవ్ర గాయాలతో రక్తస్రావం అవుతున్న యువకులను చూసి చలించిన ఎమ్మెల్యే.. వెంటనే తన వాహనంలో గాయపడిన క్షతగాత్రులను మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అంతేకాదు డాక్టర్‌తో మాట్లాడి మెరుగైన చికిత్స అందిలంచాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement