Friday, April 19, 2024

కుక్కల దాడిలో మృతి చెందిన బాలుడి కుటుంబానికి రూ 10 లక్షల చెక్ అందించిన మేయర్

ఇందల్వాయి మార్చి 6 ప్రభ న్యూస్ – హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధిలోని అంబార్ పెట్ లో నివాసం ఉండే ముత్యం గంగాధర్ కుమారుడు ప్రదీప్ ( 6) ఇటీవల విధి కుక్కల దాడిలో గాయపడి మృతి చెందిన సంఘటన రాష్ట్రంలో సంచనంగా మారింది. దీంతో మున్సిపల్ శాఖ మాత్రులు కేటీఆర్ ఆదేశాల మేరకు జిహెచ్ఎంసి నుండి 8 లక్షలు. అలాగే జిహెచ్ఎంసి చైర్మన్. డిప్యూటీ చైర్మన్. కార్పొరేటర్ జీతాల నుండి మరో రెండు లక్షలు బాధిత కుటుంబానికి అందించాలని నిర్ణయం తీసుకోగా. సోమవారం జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి చేతుల మీదుగా 10 లక్షల రూపాయల చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు అందించారు. రాష్ట్రంలో ఊహించని విధంగా ప్రదీప్ మృతి చెందడం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టింది దీంతో ప్రతిపక్షాలతో పాటు సపక్షంలోనూ తీవ్ర విమర్శలు రాగా ఎట్టకేలకు ప్రభుత్వం దిగివచ్చి ఎక్సగ్రేషియా చెల్లించడం ఆనందంగా ఉందని ఇందల్వాయి గ్రామస్తులు విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. ఎక్స్గ్రేషియా చెక్కును డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డితో కలిసి సోమవారం అందించారు. కార్యక్రమంలో ఇందల్వాయి ఎంపిటిసి సుధాకర్. సర్పంచ్ సత్యవా. డిసిసిబి డైరెక్టర్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement