Wednesday, April 24, 2024

వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను ప‌రిశీలించిన మేయ‌ర్

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 12వ డివిజన్ ఇందిరమ్మ కాలనీ ఫేస్ 3 పోచమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ ప్రక్రియను మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ… అందరూ తప్పక వ్యాక్సిన్ తీసుకోవాలని, విధిగా మాస్క్ లు ధరించి, ఎప్పటికప్పుడు చేతులను సానిటైజ్ చేసుకోవాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో NMC తెరాస పార్టీ ఉపాధ్యక్షులు పద్మ ప్రసాద్, 12వ డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షులు సుబ్బారెడ్డి, ఉపాధ్యక్షులు వెంకటేష్, జనరల్ సెక్రెటరీ బట్ట మురళి, మహిళా అధ్యక్షులు తులసి, NMC యూత్ వైస్ ప్రెసిడెంట్ రాము, డివిజన్ యూత్ ప్రెసిడెంట్ కిరణ్, డివిజన్ తెరాస పార్టీ అనుబంధ కమిటీల ముఖ్య సభ్యులు, NMC AE, DE ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement