Thursday, April 25, 2024

భారీ అగ్నిప్రమాదం.. ఎక్క‌డంటే…

భారీ అగ్నిప్ర‌మాదం జ‌ర‌గ‌డంతో.. రూ.11ల‌క్ష‌ల ఆస్తిన‌ష్టం జ‌రిగిన ఘ‌ట‌న తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని గోదావరిఖనిలోని లక్ష్మీనగర్ ఫ్యాషన్ వరల్డ్ మెన్స్ వేర్ లో తెల్లవారు జామున ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. అయితే బట్టలకు సంబంధించిన దుకాణం కావడంతో మంటలు భారీగా చెలరేగి ఆగ్నికీలలు పక్కనే ఉన్న దుకాణాలపై పడి మంటలు వ్యాపించాయి. ప్ర‌మాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే మెన్స్‌ వేర్‌ పూర్తిగా అగ్నికి ఆహుతి కావ‌డంతో సుమారు రూ.11లక్షల ఆస్తి నష్టం జరిగిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఇదిలా ఉండగా, శుక్రవారం జ‌మ్మూ తావి దుర్గ్ – ఉధంపూర్ ఎక్స్‌ప్రెస్‌లో శుక్ర‌వారం సాయంత్రం ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. రెండు ఏసీ కోచ్‌ల‌లో మంట‌లు అంటుకున్న ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయి. క్ష‌ణాల్లోనే మ‌రో రెండు ఏసీ కోచ్‌ల‌కు కూడా మంట‌లు వ్యాపించ‌డంతో.. ప్ర‌యాణికులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement