Wednesday, April 24, 2024

మావోయిస్టు నేత రావుల రంజిత్ లొంగుబాటు

మావోయిస్టుల కీలక నేత రావుల రంజిత్ అలియాస్ శ్రీకాంత్  పోలీసుల ఎదుట లొంగిపోయారు. తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి ఎదుట రావుల రంజిత్ లొంగిపోయారు. దండకారణ్యంలో రావుల రంజిత్ కీలక బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం రంజిత్‌ దండకారణ్యం బెటాలియన్‌ కమిటీ చీఫ్‌గా కొనసాగుతున్నాడు. రెండు సంవత్సరాల క్రితం తండ్రి రామన్న ఆనారోగ్య సమస్యతో చనిపోయిన విషయం తెలిసిందే. రావుల రంజిత్ కూడా అనారోగ్యంతో బాధ ప‌డుతున్నాడు. ఈ క్ర‌మంలో ఆయ‌న లొంగిపోయాడు. కాగా, రంజిత్‌ స్వస్థలం సిద్దిపేట జిల్లా ముగ్దుర్ మండలం బెక్కల్ గ్రామం.

Advertisement

తాజా వార్తలు

Advertisement