Wednesday, April 17, 2024

గుండెపోటుతో మావోయిస్టు కీలక నేత మృతి

మావోయిస్టు పార్టీ కీలక నేత కత్తి మోహన్ రావు అలియాస్ ప్రకాశన్న అలియాస్ దామ దాదా అనారోగ్యంతో మృతి చెందారు. కొంత కాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతూ కత్తి మోహన్ రావు జూన్ 10న తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ ప్రకటన విడుదల చేసింది. కత్తి మోహన్ రావు మృతి పట్ల మావోయిస్టు పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

మోహన్‌ రావు స్వస్థలం మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలం గార్ల గ్రామం. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన మోహన్‌ రావు..  మహబూబాబాద్‌లో ఇంటర్, ఖమ్మంలో డిగ్రీ, కాకతీయ యూనివర్సిటీలో ఎంఎస్సీ పీజీ పూర్తి చేశారు. డబుల్‌ గోల్డ్‌ మెడల్‌ సాధించారు. 1982లో విప్లవ జీవితంలోకి ప్రవేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement