Friday, April 26, 2024

ప్రగతి భవన్ వద్ద టెన్షన్… వ్యక్తి ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్ ప్రగతి భవన్ వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం కలకలం రేపింది. కేబినెట్ సమావేశం ప్రారంభం కావడానికి కొద్ది ముందుగా ఓ వ్యక్తి ప్రగతి భవన్ ఎదుట శరీరంపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే, పోలీసులు సకాలంలో అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది.  వ్యక్తి సోదరుడు మంత్రుల కాన్వాయ్ కి అడ్డంగా వెళ్లేందుకు యత్నించాడు. ఈ సోదరులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిది కొంపల్లి అని గుర్తించారు.

ఓ సివిల్ వివాదంలో ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదని, అందుకే ప్రగతి భవన్ ఎదుట ఆందోళనకు యత్నించామని ఆ వ్యక్తి చెప్పినట్లు తెలుస్తోంది. పేట్ బషీర్ బాగ్ పీఎస్ పిరిధిలోని మహేష్ అనే సిఐ బిల్డర్ లతో కుమ్మక్కు అయ్యి తనను వేధిస్తున్నాడని వ్యక్తి ఆరోపించినట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement