Thursday, April 25, 2024

విద్యుత్ స్థంబాన్ని ఢీకొట్టిన ట్రాక్ట‌ర్.. వ్య‌క్తి మృతి

విద్యుత్ స్థంబాన్ని ట్రాక్ట‌ర్ ఢీకొట్టిన ప్ర‌మాదంలో ఓ వ్య‌క్తి మృతి చెందాడు. ఈ సంఘ‌ట‌న యాలాల మండ‌లం దేవ‌నూర్ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన అనంత‌ప్ప అనే వ్య‌క్తి రాత్రి వేళ‌ ట్రాక్ట‌ర్ న‌డిపిస్తూ గ్రామ బ‌స్టాండ్ వ‌ద్ద ఉన్న ఓ విద్యుత్ స్థంభాన్ని ప్ర‌మాదవ‌శాత్తు ఢీకొట్టాడు. ఈ ప్ర‌మాదంలో విద్యుత్ స్థంభం  మీద‌ప‌డి అనంత‌ప్పకు త‌ల‌కు తీవ్ర‌గాయాల‌య్యాయి. గ‌మ‌నించిన స్థానికులు జిల్లా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే, అప్పటికే ఆలస్యం కావడంతో అనంత‌ప్ప మృతి చెందిన‌ట్లు వైద్యులు నిర్దారించారు. మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుప‌త్రిలోని మార్చురికి త‌ర‌లించారు. ఈ సంఘ‌ట‌న‌పై యాలాల పోలీసులు కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement