Friday, April 19, 2024

మానేరు వాగులో గల్లంతైన దేవేందర్ మృతి

మానేరు వాగులో గల్లంతైన మార్క దేవేందర్ మృతి చెందారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మీర్జంపేట గ్రామంలోనీ మానేరు వాగు నుండి దేవేందర్ మృతదేహాన్ని ఈతగాళ్ళు వెలికితీశారు. సోమవారం మానేరు వాగులో తాతా-మనవడు గల్లంతు కాగా బాలుడు అశ్వంత్ మృతదేహాన్ని ఈతగాళ్ళు వెలికితీసిన విషయం విధితమే. రాత్రి వరకు ప్రయత్నించిన దేవేందర్ ఆచూకీ దొరకకపోవడంతో మంగళవారం ఉదయం మరోసారి ఈతగాళ్లు ప్రయత్నించి మృతదేహాన్ని వెలికి తీశారు. తాతా-మనవడు మృతిచెందడంతో మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement