Saturday, April 20, 2024

టీకా వల్ల భయంలేదు..

దేవరకద్ర : కరోనా టీకా వల్ల ఎలాంటి భయం లేదని టీకా తీసుకున్న విజయ్‌ పటేల్‌ ప్రభన్యూస్‌కు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి రోజు నలభై సంవత్సరాల పైబడి ఉన్న వారికి వైద్యబృందం వారు కరోనా టీకాలు వేయడం జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు టీకా తప్పనిసరిగా తీసుకోవాలి. ఇందులో ఎటువంటి భయం ఉండదని ఆయన చెప్పారు. కరోనా టీకా వేయించుకోవడం వల్ల ఆరోగ్యం మంచిగానే ఉన్నదని ఆయన తెలిపారు. కరోనా టీకా తీసుకుంటే ఏమైనా అవుతుందేమోనని కొంత మంది ప్రజలు భయపడుతున్నారు. కరోనా టీకా తీసుకుంటే ఎటువంటి భయం ఉండదని వైద్యాధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement