Thursday, April 25, 2024

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి..

జోగులాంబ గ‌ద్వాల జిల్లా ప‌రిధిలోని ఎర్ర‌వ‌ల్లిలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఎర్ర‌వ‌ల్లి చౌర‌స్తా స‌మీపంలోని గోశాల వ‌ద్ద డీసీఎంను ఓవ‌ర్ టేక్ చేయబోయిన బైక్ అదుపుతప్పి, ఎదురుగా వ‌స్తున్న ఆర్టీసీ బ‌స్సును ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో బైక్‌పై ప్ర‌యాణిస్తున్న ముగ్గురిలో ఇద్ద‌రు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. గాయ‌ప‌డిన మ‌రో మ‌హిళ‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. స‌మాచారం అందుకున్న ఇటిక్యాల పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతుల‌ను ఐజ మండ‌లం గుడిదొడ్డి గ్రామానికి చెందిన మ‌హేశ్వ‌ర్ రెడ్డిగా, ఐజ ప‌ట్ట‌ణం టీచ‌ర్స్ కాల‌నీకి చెందిన చంద్ర‌క‌ళ‌గా పోలీసులు గుర్తించారు. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement