Friday, April 19, 2024

విషాదం.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

నవాబుపేట : నవాబుపేట మండల పరిధిలోని కాకర్ల పహాడ్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రమాదేవి అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో సహా గ్రామ సమీపంలోని నల్లకుంట చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్న తల్లి, ఇద్దరు పిల్లల మృతదేహాలు ఆదివారం ఉదయం లభ్యమయ్యాయి. విగతజీవులుగా లభ్యమైన తల్లి రమాదేవి, పిల్లలు మారుతి, చందనల మృతదేహాలను చూసిన ప్రజలు, మృతుల కుటుంబీకులు బోరున విలపించారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చెరువులో లభ్యమైన మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలు రమాదేవి బలవన్మరణానికి పాల్పడడానికి భార్యాభర్తల
మధ్య జరిగిన గొడవనే కారణమై ఉండవచ్చునని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ విషయమై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్న పోలీసులు పలు కొణాలలో విచారణ జరుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement