Friday, March 29, 2024

పేద ప్రజలకు అండగా తెలంగాణ ప్రభుత్వం..

గద్వాల : జిల్లా కేంద్రంలోని గద్వాల టౌన్‌ , గద్వాల , ధరూర్‌ , మల్దకల్‌ , గట్టు , కె.టి . దొడ్డి మండలాలకు చెందిన వివిధ గ్రామాల లబ్దిదారులకు సిఎం రిలిఫ్‌ ఫండ్‌ చెక్కులను ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని , సిఎం రిలీఫ్‌ ఫండ్‌ను లబ్దిదారులు దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డైరెక్టర్‌ సుభాన్‌ , వ్యవసాయ మార్కెట్‌ యార్డు చైర్‌ పర్సన్‌ ఈశ్వరమ్మ , ఎంపిపి రాజారెడ్డి, విజయ్‌ , జడ్పిటిసి , రాజశేఖర్‌ వైస్‌ఎంపిపిలు , సుదర్శన్‌ రెడ్డి, ఈరన్న , మార్కెట్‌ యార్డు వైస్‌ చైర్మన్‌ సంజీవులు ఆయా మండలాల , గ్రామాల అధికారులు , ప్రజా ప్రతినిధులు , లబ్దిదారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement