Thursday, April 25, 2024

వ‌న‌ప‌ర్తి జిల్లాలో రోడ్డు ప్ర‌మాదం.. 14 మందికి గాయాలు

ప్యాసింజర్‌ జీపు బోల్తాప‌డి 14 మంది గాయ‌ప‌డిన ఘ‌ట‌న వనపర్తి జిల్లాలోని కొత్తకోట సమీపంలో చోటుచేసుకుంది. కానాయపల్లికి చెందిన 14 మంది క్రూయిజర్‌లో హైదరాబాద్‌లో వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వస్తున్నారు. ఈ క్రమంలో పాలెం బ్రిడ్జి వద్ద అదుపుతప్పి పంట పొలాలకు దూసుకెళ్లి బోల్తా పడింది. దీంతో అందులో ఉన్నవాళ్లంతా గాయపడ్డారు. స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌న స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను దవాఖానకు తలించారు. వారిలో ఇద్దరి మహిళల పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement