Wednesday, April 24, 2024

ఉయ్యాలవాడ గురుకుల పాఠశాలలో కొత్తగా 12 కరోనా కేసులు..

నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని ఉయ్యాలవాడ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో కరోనా విజృంభిస్తోంది. గత రెండు రోజులుగా కరోనా కేసులు పెరగుతుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఈరోజు మరో 12 మంది విద్యార్థులకు కరోనా నిర్ధారణైంది. దీంతో కరోణ కేసుల సంఖ్య 16 కి చేరింది. నిన్న 83 మందికి పరీక్షలు నిర్వహించగా నలుగురికి కరోనా సోకినట్టు తేలింది. ఈరోజు 300 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. దీంతో మరో 12 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. అధికారులు హుటాహుటీన స్పందించి స్కూలంతా శానిటేషన్ చర్యలు చేపట్టారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి విద్యార్థికి పరీక్షలు నిర్వహించారు. 16 మంది విద్యార్థులను ఏరియా ఆసుపత్రికి తరలించి ఐసొల్యూషన్ లో ఉంచి చికిత్సలు అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement