Saturday, April 20, 2024

హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారి..

వనపర్తి : పురపాలక పరిధిలోని 33 వ వార్డులో మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, స్థానిక కౌన్సిలర్ అలేఖ్య తిరుమల్ ఆధ్వర్యంలో హైపోక్లోరైడ్ ద్రావణంను పిచికారి చేయించారు. ఈ సందర్భంగా గట్టు యాదవ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని,అత్యవసరం అయితేేే తప్ప బయటకు రావద్దని, 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని వనపర్తి పురపాలక ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ తిరుమల్, మున్సిపల్ సిబ్బందిి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement