Thursday, March 28, 2024

బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం..

మహబూబ్‌నగర్‌ : నవాబ్‌పేట మండల పరిధిలోని ఇప్పటూరు గ్రామంలో ఆకస్మికంగా జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన విఘ్నేష్‌ , ప్రశాంత్‌ కుటుంబాలకు మాజీ మంత్రి , ఎమ్మెల్యే డా.లక్ష్మారెడ్డి అండగా నిలిచారు. హృదయ విదారకమైన ఈ ఘటన మండల ప్రజలను తీవ్ర శోకసంద్రంలో ముంచిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే ఆ కుటుంబాలను ఆదుకోవాలనే లక్ష్యంతో వారి కుటుంబాలను ఆదుకోవాలంటూ ఉన్నతాధికారులను కోరగా తహశీల్దార్‌ నేతృత్వంలో మండల పిఎసిఎస్‌ అధ్యక్షుడు మాడెమని నర్సింలు ఆధ్వర్యంలో ఒక్కో కుటుంబానికి రూ. 20 వేలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి , సర్పంచ్‌ గౌషియా అబ్దుల్లా , ఎంపిటిసి లక్ష్మి బాయి , స్థానిక నాయకులు నవనీత్‌ రావు , స్వామి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement