Friday, March 29, 2024

కుల వృత్తుల అభివృద్ధికి పెద్దపీట : మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి : తెలంగాణ ప్ర‌భుత్వం కుల వృత్తుల‌కు పెద్ద‌పీట వేస్తోంద‌ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. వనపర్తి నియోజకవర్గం శ్రీరంగాపురం మండలకేంద్రంలోని రంగసముద్రంలో ప్రభుత్వ ఉచిత చేపల పంపిణీలో భాగంగా చెరువులో రొయ్యలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డ్డాక ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ ఎన్నో సంక్షేమ ప‌థ‌కాలు చేప‌ట్టి అన్ని కులాల వారికి ఉపాధి క‌ల్పిస్తున్నార‌న్నారు. ఉచిత చేప పిల్లలు చెరువుల్లో విడిచి మత్స్యకారులకు ఉపాధి కల్పించారని పేర్కొన్నారు. తెలంగాణ అమలు చేస్తున్న పథకాలను కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్రాలు పేర్లు మార్చి పథకాలు అమలు చేస్తున్నాయని ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement