Saturday, April 20, 2024

అణగారిన వర్గాల సంక్షేమం కోసం కృషి చేసిన సంస్క‌ర్త‌‌ బాబు జగ్జీవన్ రామ్

ఇటిక్యాల ,- , సమాజంలో అణ గారిన వర్గాల సంక్షేమం కోసంఅలుపెరుగని పోరాటాలు చేసి కృషిచేసిన సంఘ సంస్కర్త స్వాతంత్రసమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగజ్జీవన్ రామ్ అని మాజీ ఎంపీ ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అధికార ప్రతినిధి డాక్టర్ మందా జగన్నాథం అన్నారు. మండల పరిధిలోని కొండేరు గ్రామంలో మాజీ ఎంపీ మంద నివాసంలో అలంపూర్ టిఆర్ఎస్ పార్టీ మాజీ ఇన్చార్జి మంద శ్రీనాథ్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఏర్పాటు చేయగా మాజీ ఎంపీ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
మాజీ ఎంపీ మంద మాట్లాడుతూ దేశ స్వతంత్రం కోసం సామాజిక సమానత్వం కోసం పోరాడిన నేత ఆయన ఆశయ బాట లోనే మనమందరం నడుచుకోవాలి బాబుజీకి మనమిచ్చే ఘన నివాళిని మాజీ ఎంపీ మంద అన్నారు.
నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ మాజీ ఇంచార్జ్ మంద శ్రీనాథ్ మాట్లాడుతూ గాంధీజీ చేత అమూల్య రత్నగా పిలువబడ్డ బాబు జగ్జీవన్ రామ్ సామాజిక వివక్ష, అసమానతలు లేని ఒక స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య సమాజ నిర్మాణం కోసం బాబూజీ నిరంతరం కృషిచేశార‌న్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వీరన్న , ఎంపీటీసీ బొట్టు వీరన్న , మండల రైతు సమితి అధ్యక్షులు వల్లూరు గిడ్డా రెడ్డి , టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జింకలపల్లి రామి రెడ్డి , గద్వాల అంజి , జిల్లా యువ నాయకులు ఏకాంత్ , జిల్లా టిఆర్ఎస్వీ నాయకులు కుర్వ పల్లయ్య , బీచుపల్లి గ్రామ సర్పంచ్ నరసమ్మ సుధాకర్ రెడ్డి, కొండేరు మాజీ సర్పంచులు బలరాం తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మండల పరిధిలోని ,దళిత సంఘాల నాయకులు, ఉదండపురం గ్రామంలో సర్పంచ్ అయ్యమ్మ ఆయా గ్రామస్తులు పాల్గొని నివాళులు అర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement