Tuesday, April 16, 2024

జానారెడ్డికి మద్దతుగా జిఎంఆర్‌ ప్రచారం..

దేవరకద్ర : నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో త్రిపురారం మండలం పెద్ద దేవరపల్లి గ్రామంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జానా రెడ్డికి మద్దతుగా హైకోర్టు న్యాయవాది టిపిసిసి కార్యదర్శి మధుసూదన్‌ రెడ్డి ప్రచారం నిర్వహించారు. జానారెడ్డి గెలుపు కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని ఆయన కోరారు. జానారెడ్డి గెలుపు కోస వాడవాడలా తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. అభివృద్ది చేసే వారికే ప్రజలు పట్టం కట్టాలని ఆయన కోరారు. టిఆర్‌ఎస్‌ చెప్పే మాటలకు ప్రజలు మోసపోకుండా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ప్రచారంలో కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement