Saturday, April 20, 2024

పాలమూరు యువతకు గుడ్​ న్యూస్​.. ఈ నెల 20న ఉద్యోగ మేళా..

మహబూబ్‌నగర్‌, ప్రభన్యూస్ : జిల్లాలోని నిరుద్యోగ యువతకు జిల్లా ఎంప్లాయిమెంటు కార్యాలయం వారి ఆధ్వర్యంలో ఈ నెల 20న ఉద్యోగ మేళా నిర్వహించారు. శుకృతి ఇన్‌ఫ్రా ప్రాజెక్టు లిమిటెడ్‌, ఆస్తర్‌ ఫార్మసి, ఎస్‌బిఐ కార్డ్స్ అనే మూడు కంపెనీలలో హైదరాబాద్‌లో పని చేయుటకు 870 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని జిల్లా ఎంప్లాయిమెంట్‌ అదికారి మహ్మద్‌ జానీ ఫాషా ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కంపెనీలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కొరకై ఆసక్తి గల ఎస్‌ ఎస్‌ సి, ఇంటర్‌, డిగ్రీ, ఢీ పార్మసి, భీ ఫార్మసి అర్హత గల విద్యార్దులు ఈ నెల 20 వ తేదిన ఉదయం 10:30 గంటలకు సంబందిత సర్టిపికెట్స్‌ ఆదార్‌ కార్డుతో జిల్లా ఎంప్లాయిమెంటు కార్యాలయంలో నిర్వహించే ఉద్యోగ మేళాకు హాజరు కావాలని ఆయన తెలిపారు. ఎన్నికైన అభ్యర్దులకు 14 వేల నుండి 22 వేల వరకు జీతం ఉంటుందని పేర్కోన్నారు. ఇతర వివరాలకు ఫోన్‌ నెంబర్‌ 9550205227,08542 293462 గల నెంబర్‌ లకు సంప్రదించగలరు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement