Saturday, April 20, 2024

సాదాసీదాగా దేవస్థానం పాలకమండలి ప్రమాణస్వీకారం..

దేవరకద్ర : మండల కేంద్రంలో స్థానిక ఈశ్వర వీరప్పయ్య దేవస్థానం నూతన పాలకమండలి సభ్యులు ప్రమాణస్వీకార కార్యక్రమం దేవస్థానంలో సాదాసీదాగా అధికారులు నిర్వహించారు. నూతన పాలక మండలి సభ్యులు శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తదుపరి వీరప్పయ్య స్వామి దేవాలయంలో ఎండోమెంట్‌ ఇన్స్‌పెక్టర్‌ వీణదారి అధ్యక్షతన నూతన పాలకమండలి చైర్మన్‌ , సభ్యులు చేత ప్రమాణస్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో దేవస్థానం చైర్‌ పర్సన్‌ రాధిక భాస్కర్‌ రెడ్డి, సభ్యులు బిక్షపతి , నాగేష్‌ చెన్నయ్య , వాకిటి బాలరాజు , అర్చకులు నాగరాజు ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా నూతన వ్యవస్థను చైర్పర్సన్‌ రాధిక భాస్కర్‌ రెడ్డి మాట్లాడుతూ.. దేవాలయ అభివృద్ది కోసం తాను అన్ని విధాలా కృషి చేస్తానని ఆమె తెలిపారు. పాలకమండలి సభ్యులు కూడా దేవాలయ అభివృద్ది కార్యక్రమాలలో భాగస్వాములు కావాలని ఆమె వారిని కోరారు. తదుపరి నూతన పాలక మండలి చైర్మన్‌ కు , సభ్యులకు జడ్పిటిసి అన్నపూర్ణ శ్రీకాంత్‌ , వైస్‌ ఎంపిపి సుజాత శేఖర్‌ రెడ్డి, శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఈఓ కోమల్‌ ,మండల పార్టీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, కొండ శ్రీనివాస్‌ రెడ్డి, రైతుబంధు అధ్యక్షుడు కొండా రెడ్డి , సింగిల్‌ విండో అధ్యక్షుడు నరేందర్‌ రెడ్డి, సర్పంచ్‌లు యుగంధర్‌ రెడ్డి, శివరాజ్‌ , బుచ్చిరెడ్డి , శ్రీనివాస్‌ రెడ్డి, మాజీ ఎంపిటిసి వెంకటేష్‌ , రాములు , సూరిబాబు , రత్నయ్య , భీమన్న , లక్ష్మీనారాయణ , మధు , నాగభూషణం , మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement