Thursday, April 25, 2024

విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి మృతి..

గద్వాల : రాజోలి మండలం పచ్చర్ల గ్రామంలోనే వ్యవసాయ పొలం దగ్గర విద్యుత్‌ మరమ్మతులు చేసేందుకు ఎల్‌సి తీసుకున్న వ్యక్తి మరొక వ్యక్తి దగ్గర ఎల్‌సి తీసుకున్నాడు.ఆ వ్యక్తి మరొక దగ్గర స్థంభం ఎక్కడంతో ఆ స్తంభంకు విద్యుత్‌ సరఫరా ఉండటంతో వ్యక్తి స్థంభంపై నుండి కిందికి పడటంతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని చూసి స్థానికులు వెంటనే గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. ప్రైవేట్‌ వాహనంలో కర్నూల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడు పచ్చర్ల గ్రామానికి చెందిన తెలుగు మునిస్వామి గా గ్రామస్తులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement