Tuesday, April 23, 2024

పేదలకు వరం..సిఎం సహాయనిధి..

దేవరకద్ర : సిఎం సహాయనిధి పేదలకు వరం లాంటిదని స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి అన్నారు. నియోజకవర్గ పరిధిలోని చిన్నచింతకుంట మండలంలోని అలిపురం వాగులో సాయికుమార్‌ గౌడ్‌ ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందినందుకు వారి తండ్రి వెంకటేష్‌ గౌడ్‌ కు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద లక్ష రూపాయల చెక్కును స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి పంపిణీ చేశారు. ఈ చెక్కును లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement