Wednesday, April 17, 2024

యువకుల అత్యుత్సాహంతో ఘర్షణ.. పోలీసుల లాఠీఛార్జ్

గద్వాల జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో పురపాలక సంఘ పరిధిలోని జమ్మిచెడులో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. జములమ్మ అవ్వ దేవత పుట్టినిల్లు గుర్రం గడ్డ నుంచి నిన్న మధ్యాహ్నం బయల్దేరి ఈరోజు తెల్లవారుజామున జమ్మిచెడు గ్రామానికి చేరుకుంది. నిన్న రాత్రి జములమ్మ దేవతని గుర్రం గడ్డ నుండి గద్వాలకు ఎద్దుల బండి మీద తీసుకువస్తూ… గ్రామస్తులు పెద్ద ఎత్తున ఊరేగింపు చేపట్టారు.

ఈ సందర్భంగా బుధవారం ఉదయం జమ్మి చెడు స్టేజ్ సమీపంలో కొందరు యువకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అమ్మ వారిని తీసుకువస్తున్న ఎద్దుల బండి ముందు ఇరువర్గాలు తోపులాట చేసుకున్నారు. తోపులాట కాస్త పరిస్థితి విషమించడంతో పోలీసులు లాఠీచార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. జమ్ములమ్మ అవ్వ ఎద్దుల బండి యాత్ర సజావుగా కొనసాగి జమ్ములమ్మ టెంపుల్ కు చేరుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement