Wednesday, April 17, 2024

కరోనా పై అవగాహన కల్పించిన పోలీసులు..

రాజాపూర్‌ : మండల పరిధిలోని రంగారెడ్డి గూడ గ్రామంలో ఎస్పి రెమా రాజేశ్వరి ఆదేశానుసారం రాజాపూర్‌ పోలీసులు కరోనా కట్టడికి ప్రజలు మాస్కులు ఖచ్చితంగా ధరించాలని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో గ్రామ సర్పంచ్‌ శశికళా రెడ్డి మాట్లాడుతూ… గ్రామంలో అందరూ మాస్కులు ధరించాలని లేని యెడల జరిమాన , శిక్ష విధించడం జరుగుతుందని పోలీసులు ఎక్కడికక్కడ జరిమాన విధిస్తారని , మన గ్రామంలో ఎటువంటి సమావేశాలు , విందులు , వినోదాలకు దూరంగా ఉండటం వల్ల కరోనా కట్టడి కి సహకరించినట్లు జరుగుతుందని దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్‌ సిబ్బంది , ఉప సర్పంచ్‌ రాములు గౌడ్‌ , పంచాయితీ కార్యదర్శి లక్ష్మినారాయణ గౌడ్‌ , వ్యవసాయ విస్తరణ అధికారి దీపిక , గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement