Saturday, April 20, 2024

త‌ప్పిన పెను ప్ర‌మాదం.. వోల్వో బస్సు బోల్తా.. ప‌లువురికి గాయాలు..

వనపర్తి జిల్లాలో పెను ప్ర‌మాదం త‌ప్పింది. పెద్దమందడి మండలంలోని వెల్దూరు వద్ద జాతీయ రహదారిపై వోల్వో బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘ‌ట‌న‌లో తొమ్మిది మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. బస్సు హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. వెంట‌నే స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్న పోలీసులు ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌పై ఆరా తీశారు. అనంత‌రం క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఎలాంటి ప్రాణనష్టం జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement