Thursday, April 25, 2024

ఏటీఎంలో రూ.100కు బదులు రూ.500 నోట్లు

తెలంగాణలోని వనపర్తి జిల్లాలోని ఓ ఏటీఎంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో రూ.100 కొడితే రూ.500 నోట్లు వచ్చాయి. ఇండియా నెం.1 ఏటీఎంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విష‌యం తెలియ‌గానే స్థానికులు భారీ ఎత్తున వచ్చి డబ్బులు డ్రా చేసి సంబరాల్లో మునిగిపోయారు. అయితే పోలీసులు పెట్రోలింగ్‌కు రావడంతో అక్కడి నుంచి పారిపోయారు. అనుమానం వచ్చిన పోలీసులు ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. వెంటనే సంబంధిత ఏటీఎం అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి ఏటీఎంలోని సాంకేతిక లోపాన్ని గుర్తించి సరి చేశారు. అమౌంట్ భారీగానే విత్ డ్రా అయినట్లు గుర్తించిన బ్యాంకు సిబ్బంది.. ఏటీఎం కార్డుల ఆధారంగా అకౌంట్ల‌ను గుర్తించే ప‌నిలో ప‌డ్డారు‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement