Wednesday, April 24, 2024

కరోనా వేళ… రూ.5కే దహన సంస్కారాలు

మహబూబ్ నగర్‌లో కరోనాతో చనిపోయిన వారికి రూ.5 కే దహన సంస్కారాలు చేయనున్నట్లు మంత్రి శ్రీనివాసగౌడ్ తెలిపారు. కరోనాతో మృతి చెందిన వారికి దహన సంస్కారాలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో మృతదేహాలను అలాగే వదిలేస్తున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్‌కు రూ.5 చెల్లించి అంత్యక్రియలు చేసుకోవచ్చన్నారు. అటు కరీంనగర్‌లో ఇప్పటికే రూ.1కే దహన సంస్కారాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

మరోవైపు సీఎం కేసీఆర్ దూరదృష్టి కారణంగా తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఆక్సిజన్ కొరత, టీకాలు వేయడంపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా టీకాల కేటాయింపు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉందని ప్రతిపక్షాలు గుర్తించాలన్నారు. తెలంగాణకు చెందిన కంపెనీ టీకాలు తయారుచేస్తున్నా.. రాష్ట్రంలో టీకాల కొరత ఉండటానికి కారణం కేంద్ర ప్రభుత్వ విధానాలేనని ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement