Thursday, April 25, 2024

Breaking : మహబూబాబాద్ కి రూ.50కోట్లు మంజూరు.. సీఎం కేసీఆర్

మహబూబాబాద్ లో కలెక్టరేట్..బీఆర్ ఎస్ ఆఫీస్ ని ప్రారంభించారు సీఎం కేసీఆర్.. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో పరిస్థితి చూసి కంటతడి పెట్టాననన్నారు. జన్మలో నీళ్లు రావా అని ఎంతో బాధపడ్డానన్నారు కేసీఆర్. తెలంగాణ వచ్చిన తర్వాత దేవుడి దయవల్ల అన్నీ సాధించాం అన్నారు. మహబూబాబాద్ కి త్వరలో మరో ఇంజినీరింగ్ కాలేజ్ రానుందన్నారు. ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలని తెలిపారు. మహబూబాబాద్ పట్టణానికి రూ.50కోట్లు మంజూరు చేశారు.మున్సిపాలిటీలకు రూ.25కోట్లు ఇస్తామన్నారు సీఎం.తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement