Saturday, April 20, 2024

ప్రేమ‌జంట ఆత్మ‌హ‌త్య

ఓ ప్రేమ‌జంట‌ పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లాలో చోటుచేసుకుంది. ఓ లేడీస్‌ కార్నర్‌ షాపులో పనిచేస్తున్న యువకుడు అశ్వక్‌.. ఆ ఇంటి యజమాని కూతురిని ప్రేమించాడు. అయితే.. పెద్దలు తమ ప్రేమను అంగీకరించకపోవడంతో పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. స్థానికులు హుటాహుటిన వారిని ఆస్పత్రికి తరలిస్తుండ‌గా మార్గమధ్యలో అశ్వక్‌ చనిపోయాడు. నాగర్‌ కర్నూల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గోపిక కూడా మృతి చెందింది. ప్రేమ‌జంట ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement