Thursday, April 25, 2024

భద్రాద్రి జిల్లాలో విషాదం.. ప్రేమజంట ఆత్మహత్య

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇల్లెందు మండ‌లం నెహ్రూన‌గ‌ర్‌లో ప్రేమ జంట పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసింది. దీంతో అమ్మాయి ప్రాణాలు కోల్పోగా, అబ్బాయి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో అత‌డిని మెరుగైన‌ చికిత్స  ఖ‌మ్మం ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృతురాలి పేరు బోడ శ్వేత‌(20)గా గుర్తించారు. ఆమె స్థానికంగా ఉండే ఓ కాలేజీలో డిగ్రీ చ‌దువుతోంది. కొన్నేళ్లుగా గుగులోత్ వెంక‌టేశ్ అనే యువ‌కుడిని ప్రేమిస్తోంద‌ని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement